Saturday, December 10, 2022

పిల్లల్ని ఉత్తేజపరిచేందుకు టీచర్ ప్లాన్ ఇది...



తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగుదురులో ఉన్న సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్ / జూనియర్ కాలేజి విద్యార్థినులను ఉత్సాహపరిచేందుకు సమ్మర్ క్యాంపు జరిగినప్పుడు వారి ప్రిన్సిపాల్ ఎస్ రూప ప్రతి రోజూ వాళ్లందరికీ ఒక అరుదైన కానుక ఇచ్చేవారు. పిల్లల్ని మనస్ఫూర్తిగా హృదయానికి హత్తుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చి తరగతి గదుల్లోకి పంపేవారు. అలా చెయ్యడం ద్వారా వారిలో కొత్త శక్తి నింపినట్లయ్యి మరింత ఉత్తేజితులై చదువులోను, ఇతర కార్యకలాపాల్లో చురుకుగా ఉండేవారట. పాలస్తీనాకు చెందిన ఒక టీచర్ ఇలా చేస్తూ తమ స్టూడెంట్స్‌ని ఉత్సాహపరుస్తున్న వీడియో చూసి రూప కూడా ఇలా చేశారట. పిల్లలకు, గురువులకు మధ్య ఒక అనుబంధం ఉండేలా ఇలా చెయ్యడం చాలామంచి పని. ఆమె తర్వాత అక్కడికొచ్చినవారు ఈ మంచి అభిరుచిని కొనసాగిస్తున్నారో లేదో తెలీదు... ఈ మధ్య వెబ్ సైట్స్ చూస్తుంటే కనిపించిన ఈ వార్త మీతో పంచుకోవాలనిపించింది.