తమిళనాడులోని నాగర్కోయిల్ ప్రాంతానికి చెందిన ఎస్ శరవణ ముత్తు అనే 42 ఏళ్ళ వెల్డింగ్ కార్మికుడు తన భార్య కోసం రిమోట్ కంట్రోల్ బెడ్ తయారు చేసి తన ప్రేమను చాటుకున్నాడు. ఇతని శ్రమను గుర్తించిన నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంస్థ జాతీయ స్థాయిలో 2వ బహుమానాన్ని ప్రకటించింది. కొన్ని రోజుల కిందట అనారోగ్యానికి గురైన ముత్తు భార్యకు ఆపరేషన్ జరిగింది. ఆమె మంచం దిగలేని పరిస్థితిని గమనించిన శరవణముత్తు రిమోట్ కంట్రోల్ టాయ్లెట్ బెడ్ తయారు చేశాడు. ఇది సెప్టిక్ ట్యాంక్కు కనెక్ట్ అయ్యేలా 3 బటన్స్తో రూపొందించాడు.
సూపర్ శరవణా... మీలాంటివారుంటే భార్యలకు బాధలుండవు.
Print this post
Wednesday, April 17, 2019
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment