Thursday, October 06, 2011

ఊరు కొత్తకర్ర.. అంధులకు ఊతకర్ర

విద్యల నగరంగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం కొర్ల పంచాయితీ పరిధిలోని కొత్తకర్ర గ్రామం అంధులకు ఊతకర్రగా మారింది. ఎందుకంటే ఈ గ్రామంలోని దాదాపు 100కు పైగా కుటుంబాలకు చెందిన సుమారు 400 మంది తమ మరణానంతరం నేత్రదానం చేయడానికి నిశ్చయించుకున్నారు. ఈ మేరకు వీరంతా సమ్మతి పత్రాలపై సంతకాలు చేసి "మానవీయత" అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గోవిందరాజులుకు వాటిని అందజేశారు. తమ మరణానంతరం కూడా మరెందరికో తమ అవయువాలు ఉపయోగపడతాయనేది తమకు ఎంతో ఆనందం కల్గించే విషయమని గ్రామవాసులు పేర్కొన్నారు.

విజయనగరం జిల్లాకే చెందిన పెదనాదిపల్లి, ఏనుగువలస (గరివిడి మండలం) గ్రామస్థులు కూడా ఇదే విధంగా నేత్రదానానికి ముందుకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. Print this post

No comments: