జంట నగరాల పేర్లు విన్నాం గానీ ఈ జంట గ్రామాల కథేమిటా అనుకుంటున్నారు కదూ..! జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్నగరాలు ఒకదానికొకటి ఎంత ఆదర్శంగా ఉన్నాయో మనకు తెలీదుగానీ.. కడప జిల్లాలోని "ఎగువ కంచరపల్లి", "దిగువ కంచరపల్లి"జంట గ్రామాలు మాత్రం గత 50 ఏళ్లుగా మద్యపానం, పొగతాగడం లాంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ ఈ జిల్లాకు "ఫ్యాక్షన్"ముద్రేమిటా? అని ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి.
ఈ జంట గ్రామాల్లో ఉన్న దాదాపు 200 కుటుంబాలు భారతీయ సంప్రదాయ విలువల్ని ఆచరిస్తూ భవిష్యత్ తరాలకు వీటినేకానుకలుగా అందిస్తున్నాయి. 50 ఏళ్ళ క్రిందటే అప్పటి గ్రామ పెద్దలు ఊరి ప్రజలచేత దురలవాట్లకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞచేయించడమేగాక ఈ ప్రతిన ఏ మాత్రం సడలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.
వ్యవసాయాన్నే ప్రధాన వృత్తిగా చేసుకున్న ఈ గ్రామాల్లో అగ్గిపెట్టె దొరుకుతుందిగానీ చుట్ట, బీడీ, సిగరెట్ కనిపించవు. బయటి ఊళ్ళనుంచి వచ్చే వారికి సైతం ఇవే నియమాలు వర్తిస్తాయి. తేడా వచ్చిందో "బొబ్బిలి బ్రహ్మన్న", "మర్యాద రామన్న"ల సమక్షంలో రచ్చబండ పంచాయితీలు, శిక్షలు తప్పవు.
Print this post
Thursday, October 06, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment